News September 22, 2024

మహిళను 30 ముక్కలుగా నరికి..

image

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఇంట్లో 29 ఏళ్ల మహిళను హత్య చేసి 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచారు. 4-5 రోజుల క్రితం ఈ మర్డర్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన మహాలక్ష్మి (29) భర్త హేమంత్‌తో విడిపోయి ఒంటరిగా ఉంటోందని పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజులుగా ఆమెను పికప్, డ్రాప్ చేసేందుకు ఓ యువకుడు వచ్చే వాడని, అతడే ఈ హత్య చేసి ఉండొచ్చని ఏసీపీ తెలిపారు.

Similar News

News September 22, 2024

కొరటాల శివ-ప్రభాస్ కాంబోలో మరో సినిమా?

image

ప్రభాస్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘దేవర’ పార్ట్-2 తర్వాత వీరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం. గతంలో కొరటాల డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆయన డైరెక్ట్ చేసిన ‘దేవర’ పార్ట్-1 ఈనెల 27న రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితేనే కొరటాలకు నెక్స్ట్ బిగ్ స్టార్స్‌తో అవకాశాలు దక్కుతాయని పలువురు నెటిజన్లు అంటున్నారు.

News September 22, 2024

విచారణ జరగాలి.. దోషులను శిక్షించాలి: పవన్

image

AP: తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని Dy.CM పవన్ హామీ ఇచ్చారు. ‘దీనిపై CBIతో విచారణ జరిపించడంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి’ అని అన్నారు.

News September 22, 2024

ఖడ్గమృగాల దినోత్సవం.. మోదీ స్పెషల్ ట్వీట్

image

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ‘అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటైన ఖడ్గమృగాలను రక్షించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ఏళ్లుగా ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు. దేశంలో అత్యధికంగా ఖడ్గమృగాలు కలిగి ఉండటం గర్వించదగ్గ విషయం. వీటిని చూసేందుకు కజిరంగా ఫారెస్ట్‌ను అంతా సందర్శించండి’ అని తెలిపారు.