News April 25, 2024
వైసీపీ పాలనలో మహిళలు నష్టపోయారు: ఎంపీ

AP: దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని TDP ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మహిళలకు మళ్లీ రక్షణ రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా TDP ఎన్నో మంచి పనులు చేసిందని.. డ్వాక్రా సంఘాలను విస్తృతపరిచింది చంద్రబాబేనని గుర్తు చేశారు. YCP పాలనలో మహిళలు నష్టపోయారని విమర్శించారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పారు.
Similar News
News December 12, 2025
సలీల్ అరోరా.. 39 బంతుల్లోనే సెంచరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో శతకం నమోదైంది. ఝార్ఖండ్తో మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశారు. సలీల్ చేసిన 125 రన్స్లో 102(11 సిక్సులు, 9 ఫోర్స్) పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అటు 19వ ఓవర్లో సలీల్, గౌరవ్ రెచ్చిపోయారు. వరుసగా 4, 6, 6, 1, 6, 4(27 రన్స్) బాదేశారు. IPLలో అరోరా వికెట్ కీపర్ కేటగిరీలో రూ.30 లక్షల బేస్ ప్రైస్తో లిస్ట్ అయ్యి ఉన్నారు.
News December 12, 2025
పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
News December 12, 2025
NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

<


