News April 25, 2024

వైసీపీ పాలనలో మహిళలు నష్టపోయారు: ఎంపీ

image

AP: దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని TDP ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మహిళలకు మళ్లీ రక్షణ రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా TDP ఎన్నో మంచి పనులు చేసిందని.. డ్వాక్రా సంఘాలను విస్తృతపరిచింది చంద్రబాబేనని గుర్తు చేశారు. YCP పాలనలో మహిళలు నష్టపోయారని విమర్శించారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పారు.

Similar News

News December 12, 2025

సలీల్ అరోరా.. 39 బంతుల్లోనే సెంచరీ

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో శతకం నమోదైంది. ఝార్ఖండ్‌తో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశారు. సలీల్ చేసిన 125 రన్స్‌లో 102(11 సిక్సులు, 9 ఫోర్స్) పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అటు 19వ ఓవర్లో సలీల్, గౌరవ్ రెచ్చిపోయారు. వరుసగా 4, 6, 6, 1, 6, 4(27 రన్స్) బాదేశారు. IPLలో అరోరా వికెట్ కీపర్ కేటగిరీలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో లిస్ట్ అయ్యి ఉన్నారు.

News December 12, 2025

పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

image

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

News December 12, 2025

NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com