News February 5, 2025
మహిళలూ.. ఇది మీకోసమే!

చాలా మంది మహిళలు మేకప్ వేసుకున్న తర్వాత బ్రష్ను అలానే వదిలేసి, కొద్ది రోజుల తర్వాత దాన్నే వాడుతుంటారు. అయితే, ఇది ఎంతో ప్రమాదకరమని, టాయిలెట్ సీటు కంటే శుభ్రపరచని మేకప్ బ్రష్లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ బ్రష్ను వాడటం వల్ల మొటిమలు, చికాకు వంటి సమస్యలొస్తాయని తేలింది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మేకప్ బ్రష్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
Similar News
News January 18, 2026
APPLY NOW: SAILలో ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News January 18, 2026
అరటి పండ్ల విషయంలో గొడవ.. హిందూ వ్యాపారిని కొట్టిచంపారు!

బంగ్లాదేశ్లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. ‘ఘాజీపూర్లో లిటన్ చంద్ర ఘోష్ (55) హోటల్ నిర్వహిస్తున్నాడు. మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. ఈ క్రమంలో తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. లిటన్ హోటల్ వద్ద అవి కనిపించడంతో మాసుమ్, అతడి తల్లిదండ్రులు స్వాపన్, మాజేదా వాగ్వాదానికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. ముగ్గురినీ అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.
News January 18, 2026
ప్రజా దర్బార్ ప్రాముఖ్యత మీకు తెలుసా?

నాగోబా జాతరలో ప్రజా దర్బార్ కీలకమైన ఘట్టం. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. పూర్వం గిరిజనులు తమ గోడును రాజులకు చెప్పుకోవడానికి ఈ దర్బార్ను వేదికగా చేసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం సాగుతోంది. జాతరలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారు. గిరిజనులు తమ భూమి, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలను వివరించి పరిష్కారం కోరుతారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది.


