News March 21, 2024
మహిళా టీ20 WC క్వాలిఫయర్ షెడ్యూల్ విడుదల

మహిళా టీ20 వరల్డ్ కప్ 2024 క్వాలిఫయర్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే నెల 25 నుంచి మే 7వరకు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో శ్రీలంక, థాయిలాండ్, స్కాట్లాండ్, ఉగాండా, యూఎస్ఏ ఉండగా.. గ్రూప్-Bలో ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, యూఏఈ, వనాటు ఉన్నాయి. ఫైనల్ చేరిన 2 జట్లు టీ20 WCకి అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది.
Similar News
News December 10, 2025
వివేకా హత్యకేసులో కోర్టు కీలక ఆదేశాలు

TG: వివేకా హత్యకేసులో పలు అంశాలపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని CBIని నాంపల్లి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసును మళ్లీ విచారించాలని సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు కోర్టు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి కాల్ రికార్డింగుల ఆధారంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
News December 10, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలి.. TSUTF డిమాండ్

TG: నిన్న విద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి ఎగ్జామ్స్ <<18515127>>షెడ్యూల్పై<<>> తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(TSUTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 7 పేపర్లను 35 రోజుల పాటు నిర్వహించడం సరికాదంది. అశాస్త్రీయంగా రూపొందించిన SSC టైమ్ టేబుల్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
News December 10, 2025
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ‘స్ట్రోక్’ కేసులు.. ఎందుకంటే?

కొన్నేళ్లుగా 20-40 ఏళ్ల యువకుల్లో స్ట్రోక్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని వైద్యులు పేర్కొన్నారు. ఐటీ నిపుణులు ఉన్నట్టుండి నాడీ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ‘అదుపు లేని రక్తపోటు, నిద్రలేమి, అధిక ఒత్తిడి, ధూమపానం, నిశ్చల జీవనశైలితో పాటు షుగర్ వంటివి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. యువతలో స్ట్రోక్ ఆరోగ్యాన్నే కాకుండా వారి కెరీర్, కుటుంబ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


