News October 6, 2024

ఏపీకి ప్రత్యేకంగా ‘NCC అకాడమీ’కి కృషి: డిప్యూటీ డైరెక్టర్ జనరల్

image

APకి NCC అకాడమీ లేకపోవడంతో విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయని ఎన్‌సీసీ తెలుగు రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదనరెడ్డి తెలిపారు. అకాడమీ ఏర్పాటుకు స్థలం కోసం వెతుకుతున్నామన్నారు. ‘ఉమ్మడి APలో ప్రీ రిపబ్లిక్ డే క్యాంపుల్లో 124 మందిని ఎంపిక చేసేవాళ్లం. అకాడమీలు లేకపోవడంతో అదే సంఖ్యను కొనసాగిస్తున్నాం. కొత్తవి ఏర్పాటైతే ఆయుధ శిక్షణ, పరేడ్ గ్రౌండ్ సౌకర్యాలు సమకూరుతాయి’ అని పేర్కొన్నారు.

Similar News

News January 16, 2026

వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

image

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికం అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చేసి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

News January 16, 2026

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’

image

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజు పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈ రోజున ప్రయాణాలు వద్దంటారు. అంతే కాకుండా భోగి, సంక్రాంతి హడావుడిగా అయిపోతాయి. అందరూ కలిసి సరదాగా గడపడం కోసం కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం వద్దంటారు.

News January 16, 2026

ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

image

అధికారికంగా కాకపోయినా ట్రంప్‌ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.