News January 31, 2025
వారానికి 60గంటలు మించితే ముప్పే: ఆర్థిక సర్వే

వారానికి 55-60 పని గంటలు దాటితే ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలొచ్చే ఆస్కారముందని పార్లమెంట్కు అందిన ఆర్థిక సర్వే చెబుతోంది. రోజుకు 12hrs లేదా అంతకంటే ఎక్కువగా పని చేస్తున్న వారిలో మానసిక రుగ్మతలు వస్తున్నాయంది. ఇలా పని చేసేవారిలో మానసిక స్థితి సాధారణ సమయం పని చేసే వారికన్నా 100పాయింట్లు తక్కువ ఉన్నట్లు సాపియన్ ల్యాబ్ సంస్థ సర్వేను ఉదహరించింది. ఆఫీసులో మీరెన్ని Hours పనిచేస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 1, 2025
ఈ ఏడాది జరిగిన తొక్కిసలాటలు ఇవే..

– JAN8: తిరుపతి- వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూ లైన్లో ఆరుగురి మృతి
– JAN29: UP కుంభమేళా- మౌని అమావాస్య స్నానాల్లో 30 మంది మృతి
– FEB 15: ఢిల్లీ రైల్వే స్టేషన్- రైల్వే అనౌన్స్మెంట్ గందరగోళంతో ప్లాట్ఫాం 14, 15పై 18 మంది మృతి
– JUNE4: బెంగళూరు- RCB విక్టరీ పరేడ్లో 11 మంది మృతి
– SEP27: కరూర్లో TVK చీఫ్ విజయ్ ర్యాలీలో 41 మంది మృతి
– NOV1: శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 10 మంది మృతి
News November 1, 2025
ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలి: BJP MP

దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలన్న డిమాండ్లు క్రమేణా పెరుగుతున్నాయి. ఢిల్లీ BJP MP ప్రవీణ్ ఖండేల్వాల్ హోమ్ మంత్రి అమిత్ షాకు, ఢిల్లీ CM, మంత్రులకు లేఖ రాశారు. ఇంద్రప్రస్థగా పేరుమార్చి దేశ చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబింప చేయాలని పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు VHP కూడా ఢిల్లీ పేరు మార్పుపై కేంద్రానికి లేఖ రాసింది. ఎంపీ లేఖతో ఈ డిమాండ్కు మరింత మద్దతు వస్తోంది.
News November 1, 2025
వర్షం పడదంటున్నా ₹34 కోట్లతో క్లౌడ్ సీడింగ్

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ విఫలమవడం తెలిసిందే. కాన్పూర్ IITతో కలిసి మేఘమథనం చేసినా వాన పడలేదు. అయితే ఢిల్లీ వాతావరణం క్లౌడ్ సీడింగ్కు అనుకూలమైనది కాదని CAQM, CPCB, IMD నిర్ధారించాయని 2024లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది. అయినా ఢిల్లీ ప్రభుత్వం ₹34 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి ఇప్పటికే ₹3కోట్ల వెచ్చించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగంపై పలువురు మండిపడుతున్నారు.


