News October 6, 2024

ఉజ్వల భవిష్యత్తుకు ప్రపంచ శాంతి అవసరం: మోదీ

image

మాన‌వాళి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌పంచ శాంతి అత్య‌వ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని మోదీ పున‌రుద్ఘాటించారు. దేశాల మ‌ధ్య ఐక్య‌త‌, భాగ‌స్వామ్యం ద్వారానే సామూహిక ప్ర‌య‌త్నాల విజ‌యం ఆధారప‌డి ఉంద‌న్నారు. ICJ-ICWకు రాసిన లేఖ‌లో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగ‌స్వామ్యం ప్రపంచ శాంతికి విధానాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్

image

*ఇవాళ 1.30PMకు గవర్నర్ ఈ సదస్సును ప్రారంభిస్తారు
*ప్రజాపాలన, రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి గెస్టులకు వివరిస్తారు
*3PM-7PM వరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కొరియా బృందం, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వరల్డ్ బ్యాంక్, SIDBI సహా వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.

News December 8, 2025

హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

image

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.

News December 8, 2025

ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

image

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.