News August 16, 2024

5 నెలలకే పుట్టి, స్కూల్ హాజరులో వరల్డ్ రికార్డ్

image

AP: పల్నాడు(D) సత్తెనపల్లి వాసి మస్తాన్‌, షీబా(కేరళ) దంపతులకు ఐదో నెలలోనే బాలిక అయత్‌ జన్మించింది. కేవలం 500 గ్రాముల బరువు ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చకపోవడంతో ప్రత్యేక వైద్య పరికరాల సాయంతో బిడ్డను కాపాడుకున్నారు. ప్రస్తుతం బాలిక కేరళలో LKG చదువుతోంది. 2023-24లో 197 రోజులు తరగతులు నిర్వహించగా అన్ని రోజులూ హాజరైంది. దీంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా 4 రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

Similar News

News October 31, 2025

ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డేనా..!

image

TG: సుదీర్ఘ కాలానికి CONG అధికారంలోకి రావటంతో పదవులు ఆశిస్తున్న వారు అధికంగానే ఉన్నారు. హైకమాండ్, CM రేవంత్ ఏదో రకంగా వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోస్టుల భర్తీ చేపట్టారు. అజహరుద్దీన్‌ను మంత్రిగా, మంత్రి పదవులు కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అడ్వైజర్, ఛైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డే. ఆయనను ఎలా సంతృప్తిపరుస్తారనేది ఆసక్తికరం.

News October 31, 2025

ఈ పెయింటింగ్ ఖరీదు.. రూ.120 కోట్లు

image

మొఘల్(16వ శతాబ్దం) కాలంలో బస్వాన్ అనే చిత్రకారుడు వేసిన ఓ పెయింటింగ్‌ రూ.120 కోట్లకు(13.6 మిలియన్ డాలర్లు) అమ్ముడుపోయింది. కొండలు, పచ్చిక బయళ్ల మధ్య చీతా ఫ్యామిలీ సేద తీరుతున్నట్లుగా ఉండే ఈ చిత్రాన్ని 29.8CM ఎత్తు, 18.6CM వెడల్పు ఫ్రేమ్‌పై గీశారు. తాజాగా ఆ పెయింటింగ్ లండన్‌లో జరిగిన క్రిస్టీ వేలంలోకి వచ్చింది. అంచనాకు మించి సుమారు 14 రెట్ల అధిక ధర పలికింది.

News October 31, 2025

ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్

image

హీరో అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్‌మెంట్ ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తేదీపై త్వరలో ప్రకటన రానుంది.