News July 8, 2024
మట్టి వినాయకులను పూజించండి: పవన్

AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్తో పవన్ వ్యాఖ్యానించారు.
Similar News
News October 24, 2025
దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి సజీవదహనం అయ్యారు. యాదాద్రి జిల్లా గుండాల మం. వస్తకొండూరుకు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆమె.. నిన్న రాత్రి బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఆమె సజీవదహనం అయ్యారు. దీంతో అనూష పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
News October 24, 2025
IGMCRIలో 226 నర్సు పోస్టులు

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. <
News October 24, 2025
బస్సు ప్రమాదం: తెలంగాణ ప్రభుత్వం పరిహారం

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రవాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడమే కాకుండా పరిహారం ప్రకటించింది. <<18088909>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రేవంత్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ఇప్పటికే హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించింది. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.


