News November 14, 2024
WOW: ఇది ప్రభుత్వ పాఠశాలే..!

దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలను సీఎం ఆతిశీ ఇవాళ ప్రారంభించారు. సుందరి నగర్లో ఈ స్కూల్ను సరికొత్త హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించారు. మూడంతస్తుల్లో 131 గదులు, 7 ల్యాబ్లు, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, యోగా రూమ్, లిఫ్ట్, టాయిలెట్ల బ్లాక్ తదితర సౌకర్యాలతో నిర్మించారు. ఇందులో దాదాపు 7 వేల మంది విద్యార్థులు చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కూల్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.