News March 12, 2025
WPL: ఆర్సీబీ విజయం.. మూడోసారి ఫైనల్లో ఢిల్లీ

WPL 2025లో చివరి లీగ్ మ్యాచులో ముంబైపై ఆర్సీబీ గెలుపొందింది. వరుస ఓటముల నడుమ ఓదార్పు విజయంతో బెంగళూరు సీజన్ను ముగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 199 పరుగులు చేయగా ఛేదనలో ముంబై 188 పరుగులకే పరిమితమైంది. దీంతో NRR ఆధారంగా వరుసగా మూడో సారి ఢిల్లీ ఫైనల్ చేరింది. రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్తో ముంబై తలపడనుంది.
Similar News
News November 24, 2025
AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
News November 24, 2025
తిరుమల కొండపై ‘బంగారు బావి’ వైభవం

శ్రీవారి దర్శనం తర్వాత కనిపించేదే ‘బంగారు బావి’. దీనికి బంగారు రేకుల తాపడం ఉంటుంది. అందుకే ఈ పేరొచ్చింది. ఇందులో నుంచి వచ్చే జలాన్ని స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తారు. ఈ బావి అడుగున వైకుంఠంలో ప్రవహించే విరజానది ప్రవహిస్తుందని నమ్ముతారు. పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తిగా ఉన్న రంగదాసు ఈ పవిత్ర బావిని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ జలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <


