News December 14, 2024
నమ్మకంతో పరీక్ష రాయండి.. గ్రూప్-2 అభ్యర్థులకు వెంకటేశం సూచన
పబ్లిక్ సర్వీస్ కమిషన్పై నమ్మకం ఉంచి గ్రూప్-2 అభ్యర్థులు పరీక్షలు రాయాలని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం సూచించారు. రేపు, ఎల్లుండి జరిగే ఎగ్జామ్స్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని, అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత వేగంగా ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
Similar News
News January 16, 2025
తల్లి కాదు రాక్షసి.. ఫాలోవర్లు, డబ్బు కోసం కూతురిని..
సోషల్ మీడియాలో ఫాలోవర్లు, డబ్బుల కోసం ఆస్ట్రేలియాలో ఓ మహిళ (34) దారుణానికి పాల్పడింది. ఏడాది వయసున్న కూతురికి అనవసర ఔషధాలను ఇచ్చి అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. చిన్నారి పడే బాధను ఫొటోలు, వీడియోల రూపంలో టిక్టాక్లో పోస్టు చేసి విరాళంగా $37,300ను పొందింది. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
News January 16, 2025
‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News January 16, 2025
కొత్త లుక్లో YS జగన్(PHOTO)
రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్లో కనిపించారు. రెగ్యులర్గా సాధారణ డ్రెస్లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.