News October 3, 2024
కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్

AP: వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమగోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నదానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 17, 2026
ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్లను వాడుకోవాలని కేంద్రం సూచన

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. LPGకి బదులు వీలున్నవాళ్లు ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్లను వాడుకోవాలని తెలిపింది. ఇలా ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్లను వాడమని సూచించడం ఇదే తొలిసారి. అలాగే PNGకి మారే అవకాశాన్నీ పరిశీలించాలని కోరింది. ఇలా వీలైన చోట గ్యాస్ను పొదుపు చేయడం కోసం ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలంది. ఎట్టిపరిస్థితుల్లో పానిక్ బుకింగ్ చేయొద్దని కోరింది.
News March 17, 2026
‘లంచ్ బాక్స్ తెచ్చుకోండి’.. IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు

దేశంలో నెలకొన్న LPG కొరత IT ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తోంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంటీన్ సేవలను తగ్గించాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ కౌంటర్లను మూసివేసి కేవలం లిమిటెడ్ మెనూని మాత్రమే అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కంపెనీలు సూచించాయి. హాస్టళ్లు, PGల్లో ఉంటూ క్యాంటీన్ ఫుడ్పై ఆధారపడే టెకీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.
News March 17, 2026
SGSW ఉద్యోగులు.. ఆలస్యమైతే లీవ్ కట్

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) ఉద్యోగుల హాజరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 10.30amలోగా హాజరు నమోదు చేయాలని, 10min గ్రేస్ టైమ్ ఉంటుందని స్పష్టం చేసింది. 10.40am తర్వాత హాజరు నమోదైతే హాఫ్ డే సెలవుగా, 2.01pm-5pm మధ్య హాజరు నమోదైతే పూర్తి రోజు సెలవుగా పరిగణించనుంది. ఉద్యోగుల అటెండెన్స్ యాప్లో ఈ నిబంధనలు కనిపిస్తున్నాయి. DDO అనుమతితో నెలకు 3 రోజులు దీని నుంచి మినహాయింపు పొందొచ్చు.


