News October 3, 2024
కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్

AP: వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమగోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నదానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 3, 2025
3 రాజధానులపై YCP యూటర్న్?

AP: అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి 3రాజధానులు అవసరమని అధికారంలో ఉన్నప్పుడు YCP బలంగా వాదించింది. విశాఖ, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు కార్యరూపం దాల్చలేదు. కాగా, 3 రాజధానులు అప్పటి మాట అని, ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని బొత్స అన్నారు. దీంతో YCP యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. దీనిపై మీ COMMENT.
News March 3, 2025
రోహిత్పై కామెంట్స్.. కేంద్రమంత్రి మండిపాటు

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ <<15636715>>వ్యాఖ్యలను<<>> కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.
News March 3, 2025
జనసేనలోకి మాజీ MLA!

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పవన్ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. వారం రోజుల్లో ఆయన JSP తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు AUGలో వైసీపీకి రాజీనామా చేశారు.