News November 26, 2024
YCP సర్కార్ సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు చేసింది: పవన్

AP: వైసీపీ ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత లేకుండా పాలించిందని Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘చంద్రబాబు, లోకేశ్, నన్ను ఇబ్బంది పెట్టినవారిని శిక్షించాలని మీడియా కూడా కోరుకుంటోంది. వారిని పట్టుకోవటంలో తటపటాయింపు ఎందుకని అడుగుతోంది. కానీ నేనేం హోంమంత్రిని కాదు. ఆ విషయం పోలీసులే చూసుకుంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 7, 2025
APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

చెన్నై ఆవడిలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<
News November 7, 2025
రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.
News November 7, 2025
DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాదాపు 10% వరకు పెరగవచ్చని పేర్కొన్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. టారిఫ్స్ పెంచితే ఉదాహరణకు రోజుకు 2GB 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.


