News November 26, 2024

YCP సర్కార్ సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు చేసింది: పవన్

image

AP: వైసీపీ ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత లేకుండా పాలించిందని Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘చంద్రబాబు, లోకేశ్, నన్ను ఇబ్బంది పెట్టినవారిని శిక్షించాలని మీడియా కూడా కోరుకుంటోంది. వారిని పట్టుకోవటంలో తటపటాయింపు ఎందుకని అడుగుతోంది. కానీ నేనేం హోంమంత్రిని కాదు. ఆ విషయం పోలీసులే చూసుకుంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News April 16, 2026

దక్షిణాదికి అన్యాయం జరగదు: మోదీ

image

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని.. తమకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. రాజకీయాల్లో తమ శక్తి చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.

News April 16, 2026

YouTube షార్ట్స్‌కు బానిస అయ్యారా? ఇలా చేస్తే కనిపించవు..

image

కొంత మంది గంటల తరబడి యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తారు. అలాంటి వారి కోసం స్క్రీన్ టైమ్ తగ్గించేలా యూట్యూబ్ డిజేబుల్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని కోసం యూట్యూబ్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి టైమ్ మేనేజ్‌మెంట్ సెలక్ట్ చేసుకోవాలి. కింది భాగంలో ‘Shorts feed limit’ ఆన్ చేసి జీరో మినట్స్ ఎంచుకోవాలి. దీంతో మీకు ఇక షార్ట్స్ కనిపించవు. తిరిగి చూడాలి అనుకుంటే Shorts feed limit ఆఫ్ చేస్తే చాలు.

News April 16, 2026

యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?

image

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలంటే ఆ దేశంపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా వైట్ హౌస్‌లో నెదర్లాండ్స్ రాజు అలెగ్జాండర్‌తో జరిగిన ప్రైవేట్ డిన్నర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హార్ముజ్‌ను దిగ్బంధించినట్లు టాక్. అదే నిజమైతే భారత్ సహా పలు దేశాలు మరికొన్నాళ్లు చమురు సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.