News April 12, 2025
గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 10, 2025
అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి: మోదీ

ప్రముఖ రచయిత <<18246561>>అందెశ్రీ<<>> మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన.. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది’ అని పేర్కొన్నారు.
News November 10, 2025
ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

శరీర పెరుగుదలకు ఎముకలు బలంగా ఉండటం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యకాంతిలో ఉంటే ఎముకలు బలంగా ఉంటాయని అంటున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా చేయాలని సూచిస్తున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని లేకుంటే ఎముకల సాంద్రత తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<


