News April 12, 2025

గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

image

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 10, 2025

అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి: మోదీ

image

ప్రముఖ రచయిత <<18246561>>అందెశ్రీ<<>> మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన.. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది’ అని పేర్కొన్నారు.

News November 10, 2025

ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

image

శరీర పెరుగుదలకు ఎముకలు బలంగా ఉండటం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యకాంతిలో ఉంటే ఎముకలు బలంగా ఉంటాయని అంటున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా చేయాలని సూచిస్తున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్‌, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని లేకుంటే ఎముకల సాంద్రత తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

News November 10, 2025

భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> నోయిడా 10 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS, డిప్లొమా, MD, MS, DNB, MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు ప్రొఫెసర్‌కు రూ.2.22లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.47లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.27లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in/