News April 12, 2025

గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

image

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News December 22, 2025

TETపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్

image

AP: టీచర్లందరికీ TET తప్పనిసరి చేస్తూ ఇటీవల SC ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 2011లో ఈ విధానం వచ్చింది. అయితే SC తీర్పుతో అంతకు ముందు నియమితులైన వారికీ టెట్ తప్పనిసరైంది. వీరు 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలి. ఎన్నో ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తాము ఇపుడు టెట్ పాసవ్వాలనడంపై లక్షలాది టీచర్లు ఆందోళనతో ఉన్నారు. దీనిపై వారి వినతితో మినహాయింపు కోసం ఈ పిటిషన్ వేశామని ఓ అధికారి తెలిపారు.

News December 22, 2025

ఏమయ్యా.. నీకు రోజూ అదే పనా?

image

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇయర్ ఎండ్ రిపోర్టులో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో కండోమ్స్ కోసం ఏకంగా రూ.1.06 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. నెలకు సగటున 19 చొప్పున 228 ఆర్డర్‌లు ఇచ్చాడని తెలిపింది. దీంతో ‘ఏం బాబూ నీకు రోజూ అదే పనా?’ అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా తమకు వచ్చే ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ఆర్డర్ ఉందని సంస్థ చెప్పింది.

News December 22, 2025

ఇంటి వెనుక ఖాళీ స్థలం వదిలితేనే ఆరోగ్యం

image

ఇంటి వెనుక ఖాళీ స్థలాన్ని కచ్చితంగా వదలాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. తద్వారా గాలి ప్రసరణతో ఇంట్లో ఉక్కపోత, తేమ తగ్గుతాయని అంటున్నారు. ‘సహజ వెలుతురు వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వాస్తు రీత్యా ఇంటి వెనుక భాగం ఖాళీ ఉంటే కుటుంబంలో ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి ఉంటాయి. స్థలం తక్కువని నిర్లక్ష్యం చేయకుండా కొంత వరకైనా ఇంటి వెనకాల స్థలం వదిలాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>