News April 12, 2025
గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 12, 2025
‘ఉరి’ని తొలగించడంపై SCలో JAN 21న విచారణ

నేరాలకు విధించే మరణశిక్షలో ఉరితీసే పద్ధతిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 2026 జనవరి 21కి వాయిదా వేసింది. ఎక్కువ బాధను కలిగించే ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్, విద్యుత్ షాక్ తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పిటిషనర్ కోరారు. అయితే విచారణ వచ్చే ఏడాది చేపట్టాలన్న అటార్నీ జనరల్ వెంకటరమణి విజ్ఞప్తితో SC వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
News November 12, 2025
దేహమే శివాలయం అని చెప్పే శ్లోకం

‘దేహం దేవాలయం ప్రోక్తం జీవో దేవ ‘స్సనాతన:’’
ఈ శ్లోకం ప్రకారం.. మన శరీరమే ఒక దేవాలయం. ఈ ఆలయంలో నివసించే ప్రాణం సాక్షాత్తూ పరమశివుడే! మన జీవం, పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం అంతా ఈశ్వరుడే. ఇదే శివతత్వం ముఖ్య సారాంశం. నిజమైన యోగి సాధన ద్వారా ఈ శరీర రహస్యాన్ని అర్థం చేసుకుంటాడు. పంచభూతాలకు అతీతంగా ఉండే పరమ సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ జీవుడు శివయోగిగా మారి, శివుడితో ఏకమవుతాడు. <<-se>>#SIVA<<>>
News November 12, 2025
ఆయిల్పామ్.. మొక్కలను ఎంపికలో జాగ్రత్తలు

ఆయిల్పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


