News April 12, 2025

గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

image

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News April 18, 2025

కాంగ్రెస్ బతుకు అగమ్యగోచరమే: బండి సంజయ్

image

TG: రాహుల్, సోనియా గాంధీ పేర్లను ED ఛార్జ్‌షీట్‌లో చేర్చడంపై HYD ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశ ప్రజలంతా ఛీత్కరించుకోవడం, దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామనే నిరాశలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వివేకం, వ్యక్తిత్వం వదిలేసి PMపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి భాష చూస్తే 2029 కాదు, యుగం గడిచినా ఆ పార్టీ బతుకు అగమ్యగోచరమే’ అని ట్వీట్ చేశారు.

News April 18, 2025

అరుదైన ఘనత సాధించిన హెడ్

image

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్‌వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.

News April 18, 2025

ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

image

1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్(ఫొటోలో) మరణం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం (అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం)

error: Content is protected !!