News December 27, 2024
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News January 30, 2026
OTTలోకి ‘నారీ నారీ నడుమ మురారి’

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్ టాక్ తెచ్చుకున్న శర్వానంద్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ OTTలోకి వచ్చేస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.
News January 30, 2026
ఉద్యోగులు SM అకౌంట్ తెరవాలంటే అనుమతి తప్పనిసరి!

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వాడకంపై బిహార్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులెవరైనా SM ఖాతాను తెరవడానికి అధికారుల అనుమతి తప్పనిసరి. వీటికి అధికారిక ఈమెయిల్, ప్రభుత్వ నంబర్లను వాడరాదు. వారి హోదా, ప్రభుత్వ లోగోను SM పోస్టులలో ఉపయోగించరాదు. నకిలీ ఖాతాలను వాడితే చర్యలు తప్పవు. డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News January 30, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


