News October 3, 2024

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Similar News

News December 6, 2025

ఫోన్‌ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

image

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.

News December 6, 2025

ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. భద్రతకు ముప్పు!

image

కేంద్రం పరిశీలిస్తున్న ఫోన్ల లొకేషన్ ట్రాకింగ్ అంశాన్ని యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్ల ప్రైవసీకి విరుద్ధమని, ఫోన్లు నిఘా పరికరాలుగా మారుతాయని అంటున్నట్లు సమాచారం. ‘ట్రాకింగ్ తప్పనిసరి చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. యూజర్లలో సైన్యానికి చెందిన వారు, జడ్జిలు, జర్నలిస్టులు ఉంటారు. భద్రతా పరమైన సమస్యలు వస్తాయి’ అని చెబుతున్నట్లు Reuters తెలిపింది.

News December 6, 2025

పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

image

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.