News November 27, 2024
అవును.. నేనో కామన్ మ్యాన్: ఏక్నాథ్ శిండే

తాను ప్రజా సేవకుడినని, ఎప్పుడూ సీఎంగా భావించలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే అన్నారు. ‘CM అంటే కామన్ మ్యాన్. నేనిలాగే ఫీలవుతా. మేమెప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలు ఇంటినెలా నెట్టుకొస్తున్నారో, వారి బాధలేంటో చూశాను. అందుకే లడ్కీ బహన్ స్కీమ్ తీసుకొచ్చాను. PM మోదీ ఎంతో సాయం చేశారు. మా ఇద్దరి విజన్ ఒక్కటే. MVAలో ఆగిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను మేం పూర్తిచేశాం’ అని అన్నారు.
Similar News
News November 5, 2025
రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.
News November 5, 2025
NEET-SS దరఖాస్తులు ప్రారంభం

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.
News November 5, 2025
ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


