News February 7, 2025

రీఛార్జ్ చేయకున్నా కాల్స్ మాట్లాడొచ్చు!

image

సింపుల్ ట్రిక్ పాటిస్తే ఫ్రీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉండాలి. మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు Settings> Network> Internet Settings > Sim & Mobile network> Sim> Wifi Calling Toggle> activate చేయాలి. మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్‌గా వైఫైతో కాల్స్ చేసుకోవచ్చు.

Similar News

News April 4, 2026

JGTL: మంత్రి అడ్లూరి.. జీవన్‌ రెడ్డిలా నడిపించగలరా?

image

గత 40 ఏళ్లుగా మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉండి, పార్టీని నడిపించారు. జగిత్యాలతోపాటు ధర్మపురి, చొప్పదండి, కోరుట్ల, వేములవాడ అభ్యర్థుల గెలుపులో కీలకంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన రాజీనామాతో, బాధ్యతలన్నీ మంత్రి అడ్లూరిపై పడ్డాయి. మంత్రి జిల్లా నియోజకవర్గాల్లో పట్టు సాధించగలరా?, అన్ని చోట్ల నిర్ణయాత్మకంగా మారి, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయగలరా? అనేది ఆసక్తికరంగా మారింది.

News April 4, 2026

టెన్త్ విద్యార్థులకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

image

AP: SSC పరీక్షల్లో సందిగ్ధపు సమాధానాలున్న ప్రశ్నలను అటెంప్ట్ చేసిన వారికి మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. HINDIలో 2, ENGLISHలో 5 మార్కులు కలవనున్నాయి. మరో 3ప్రశ్నలపైనా పేరెంట్స్ విన్నవించారు. కాగా ప్రశ్నల్లో పొరపాట్లు లేవని, విద్యార్థి సమగ్రత పరీక్షకు వివిధ రూపాల్లో అడుగుతుంటారని బోర్డు వర్గాలు వివరించాయి. సందిగ్ధం ఉన్న వాటిపై ప్రిన్సిపల్ వేల్యుయేషన్‌ సూచనలను DEOలకు పంపుతున్నట్లు తెలిపాయి.

News April 4, 2026

హార్ముజ్.. కొత్త రూట్ దొరికినట్లేనా?

image

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన మూడు భారీ నౌకలు తాజాగా సేఫ్‌గా బయటపడ్డాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక బిగ్ రిలీఫ్ అని నిపుణులు భావిస్తున్నారు. ఈ నౌకలు ఇరాన్ నిఘా కన్నుగప్పి ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్స్‌ను కాదని ఒమన్ ప్రాదేశిక జలాల్లో నుంచి కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. దీంతో మిగిలిన దేశాలు కూడా ఇదే రూట్‌ను ప్రత్యామ్నాయంగా చూసే అవకాశం ఉంది.