News February 7, 2025

రీఛార్జ్ చేయకున్నా కాల్స్ మాట్లాడొచ్చు!

image

సింపుల్ ట్రిక్ పాటిస్తే ఫ్రీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉండాలి. మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు Settings> Network> Internet Settings > Sim & Mobile network> Sim> Wifi Calling Toggle> activate చేయాలి. మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్‌గా వైఫైతో కాల్స్ చేసుకోవచ్చు.

Similar News

News February 8, 2025

BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్

image

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్‌లో చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే.

News February 8, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 8, 2025

‘స్కిల్ ఇండియా’కు రూ.8,800 కోట్లు

image

దేశంలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రారంభించిన ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.O, జన్ శిక్షణ్ సంస్థాన్‌, PM-NAPS పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.

error: Content is protected !!