News February 7, 2025
రీఛార్జ్ చేయకున్నా కాల్స్ మాట్లాడొచ్చు!

సింపుల్ ట్రిక్ పాటిస్తే ఫ్రీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉండాలి. మీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు Settings> Network> Internet Settings > Sim & Mobile network> Sim> Wifi Calling Toggle> activate చేయాలి. మొబైల్ నెట్వర్క్ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్గా వైఫైతో కాల్స్ చేసుకోవచ్చు.
Similar News
News February 11, 2026
భారత్లో తగ్గిన అవినీతి

ఇండియాలో అవినీతి తగ్గినట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. కరప్షన్ ఇండెక్స్లో 2024లో 182 దేశాల్లోకెల్లా 96వ స్థానంలో ఉన్న భారత్ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకింది. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్.. అతితక్కువ అవినీతి ఉన్న దేశాలుగా నిలిచాయి. దక్షిణ సూడాన్, సోమాలియా అత్యంత అవినీతిమయ దేశాలుగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత USలో అవినీతి పెరిగినట్లు తేలింది.
News February 11, 2026
ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. మ్యాచుకు కష్టమే!

డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్కు వెళ్లిన అభి.. నొప్పితో కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. నిన్న ఆస్పత్రిలో చేరగా, నేడూ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు నమీబియాతో జరిగే మ్యాచులో ఆడటం అనుమానమేనని సమాచారం. ఫిట్నెస్ ఆధారంగా FEB 15 పాక్తో మ్యాచ్ ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు.
News February 11, 2026
తిరుమల కొండపై పూలు ఎందుకు ధరించరు?

శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందాలనేది భక్తుల విశ్వాసం. పూర్వం ఓ శిష్యుడు దేవుడికి అర్పించాల్సిన పూలను తాను ధరించాడు. అలా ‘పరిమళ ద్రోహం’ చేసినట్లు పురాణ గాథ. అందుకే, అప్పటి నుంచి భక్తులు కొండపై పూలు పెట్టుకోకూడదనే నియమం వచ్చింది. స్వామికి అలంకరించిన పూలను కూడా ఇతరులకు ఇవ్వకుండా పవిత్రమైన బావిలోనే వేస్తారు. ఈ నియమం పాటించడం స్వామివారిపై ఉన్న భక్తికి నిదర్శనం.


