News April 11, 2025
యువతిపై 23 మంది అత్యాచారం.. స్పందించిన మోదీ

యూపీ వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. వారణాసిలో ల్యాండ్ కాగానే ఈ ఘటనపై పోలీసులు, కలెక్టర్తో మాట్లాడారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తనను కిడ్నాప్ చేసి ఆరు రోజుల పాటు హోటళ్లు, హుక్కా బార్లకు తీసుకెళ్లి 23 మంది అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News April 21, 2025
BE READY: రేపు మ.12 గంటలకు..

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు మ.12 గం.కు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. Way2News యాప్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మార్క్స్ లిస్టును ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK
News April 21, 2025
ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా వాల్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.
News April 21, 2025
బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.