News January 11, 2025
చాహల్తో డేటింగ్పై స్పందించిన యువతి
టీమ్ఇండియా బౌలర్ చాహల్ తన భార్య ధనశ్రీతో విడిపోనున్నట్లు వార్తలొస్తున్న వేళ ఓ అమ్మాయితో ఆయనున్న ఫొటో వైరలవుతోంది. RJ మహ్వాశ్తో ఆయన డేటింగ్లో ఉన్నట్లు నెటిజన్లు ఈ ఫొటో షేర్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘ఇవన్నీ ఊహాగానాలే. ఒక అబ్బాయి, అమ్మాయితో తిరిగితే డేటింగేనా? రెండు మూడు రోజులుగా ఓపిగ్గా ఉన్నా. క్లిష్ట సమయంలో ఇతరులను తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గడపనివ్వండి’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 18, 2025
రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్శర్మ
ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. CT జట్టు ప్రకటన సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొద్దిరోజుల క్రితం హిట్మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్తో జరిగే మ్యాచ్లో రోహిత్ బరిలోకి దిగనున్నారు. కాగా 2015లో చివరిసారి అతడు రంజీట్రోఫీలో ఆడారు.
News January 18, 2025
భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?
ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.
News January 18, 2025
ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?
అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.