News January 12, 2025

యువజన దినోత్సవ శుభాకాంక్షలు: తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలి. సోషల్ మీడియాను మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘యువతకు మార్గదర్శి, భారతీయ ఆధ్యాత్మిక మహర్షి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Similar News

News January 20, 2026

తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

image

దావోస్‌ వేదికగా గూగుల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో TG CM రేవంత్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌ల ప్రోత్సాహంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి ఫార్ములాను రేవంత్ వివరించారు.

News January 20, 2026

భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం

image

<<18887766>>WEF<<>>లో ట్రంప్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏడుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. వీరిలో టాటా సన్స్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్, భారతీ Airtel ఛైర్మన్ సునీల్ మిట్టల్, విప్రో CEO శ్రీనివాస్ పల్లియా, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఛైర్మన్ సంజీవ్, మహీంద్రా గ్రూప్ CEO అనీష్ షా, జూబిలెంట్ గ్రూప్ కో-ఛైర్మన్ భర్తియా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత ట్రంప్ WEFలో పాల్గొంటున్నారు.

News January 20, 2026

సభలో కూర్చున్నప్పుడే MPల అటెండెన్స్: స్పీకర్

image

లోక్‌సభ సభ్యుల అటెండెన్సును వారు సభలో కూర్చున్నప్పుడే తీసుకోనున్నామని స్పీకర్ ఓం బిర్లా మీడియాకు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు హౌస్ బయట హాజరు వేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సభ ముగిసిన, ఏదైనా కారణంతో అర్థాంతరంగా వాయిదా పడిన తర్వాత హాజరు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హాజరు నమోదుకు సభ్యుల సీట్ల వద్ద కన్సోల్‌ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.