News July 21, 2024
గవర్నర్ను కలిసిన వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం, వైసీపీ నేతలపై దాడుల గురించి గవర్నర్కు వివరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 16, 2025
టెట్ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు కూడా జనరల్ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.
News November 16, 2025
250 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 250 గ్రూప్-B పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023/24/25 స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 30 ఏళ్లు మించరాదు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.99,000 వరకు ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
వెబ్సైట్: https://cabsec.gov.in/
News November 16, 2025
ఇంటి వస్తువులను పాదబాటలపై పెట్టవచ్చా?

జనరేటర్లు, షెడ్లను పాదబాటలపై ఏర్పాటు చేయడం వాస్తు విరుద్ధమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాన, ఎండ నుంచి రక్షణ కోసం పాదబాటలపై షెడ్ వేసినా, అది ప్రజల హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ‘ఇంటికి చెందిన ప్రతి వస్తువు, నిర్మాణం ఇంటి ప్రాంగణంలోనే ఉండాలి. వీధులను ఆక్రమిస్తే వాస్తు శక్తికి ఆటంకం కలుగుతుంది. ఎవరి పరిధిలో వారు ఉంటేనే వాస్తు ఫలితాలు పూర్తిగా లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


