News June 24, 2024

సతీసమేతంగా బెంగళూరుకు వైఎస్ జగన్

image

AP: పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. గడచిన 3 రోజులుగా అక్కడే ఉన్న ఆయన, ప్రజాదర్బార్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, పార్టీ శ్రేణులతోనూ సమావేశమై వారికి ధైర్యం చెప్పారు. ఇక ఈరోజు మధ్యాహ్నంతో పులివెందుల పర్యటన ముగించుకున్న జగన్, సతీసమేతంగా అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.

Similar News

News October 28, 2025

మరోసారి బాలకృష్ణకు జోడీగా నయనతార?

image

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబోలో సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

News October 28, 2025

మానవులకు బాధలెందుకు కలుగుతాయి?

image

మానవులకు సుఖదుఃఖాలు కలగడానికి ముఖ్య కారణం మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మనం చేసే పనుల మీద, మనం చూసే, వినే, తినే విషయాల మీద మనకు ఇష్టం లేదా అయిష్టం అనే భావాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక విషయం నచ్చితే ఆనందం కలుగుతుంది. లేకపోతే బాధ కలుగుతుంది. ఈ విధంగా మన ఇష్టాలు, అయిష్టాల (రాగద్వేషాల) కారణంగానే మనుషులకు సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ రెండింటిని దాటితేనే శాంతి చేకూరుతుంది. <<-se>>#WhoIsGod<<>>

News October 28, 2025

అమెజాన్‌లో 30వేల ఉద్యోగాల తొలగింపు?

image

అమెజాన్ కంపెనీ 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ్టి నుంచి లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కార్పొరేట్ వర్క్ ఫోర్స్ నుంచి ఈ తొలగింపులు ఉండనున్నట్లు పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా అమెజాన్ 1.54 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో కార్పొరేట్ ఎంప్లాయిస్ 3,50,000 మంది ఉంటారని అంచనా.