News June 21, 2024
రేపు పులివెందులకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి 5 రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ జిల్లాల YCP నేతలు, కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
Similar News
News September 15, 2025
పులిపిర్లకు ఇలా చెక్ పెట్టేద్దాం

వివిధ ఆరోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్సైడర్ వెనిగర్లో ముంచి పులిపిర్లపై అద్దుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. • కలబందను పులిపిర్లపై రాస్తే కొద్దిరోజుల్లోనే రాలిపోతాయి. • ఆముదంలో బేకింగ్ పౌడర్ కలిపి, దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా పోతాయి.
News September 15, 2025
చీనీ, నిమ్మలో తెగుళ్లు.. నివారణ

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు(ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.
News September 15, 2025
నవంబర్లో టెట్: కోన శశిధర్

AP: మెగా DSCలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది DSC నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్లో టెట్ ఉంటుందని, ప్రిపేర్ కావాలని సూచించారు.