News December 25, 2024

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు వెంటాడుతున్నాయి: రామ్మోహన్

image

AP: YCP హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జలజీవన్ మిషన్, హౌసింగ్ పథకాల్లో అధికారిక లెక్కలకు క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు. నాటి ప్రభుత్వ వైఫల్యాలు నేటికీ వెంటాడుతున్నాయని తెలిపారు. గతంలో అనేక అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం ఏపీకి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

Similar News

News January 22, 2025

కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

image

కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

News January 22, 2025

హైదరాబాద్‌లో HCL కొత్త టెక్ సెంటర్

image

HYDలో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని HCL ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న WEFలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

News January 22, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.860 పెరిగి రూ.82,090 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.75,250కి చేరింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది.