News March 6, 2025

అధికారంలోకి వచ్చేది వైసీపీనే: గోరంట్ల మాధవ్

image

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 6, 2025

నుజ్జునుజ్జయిన మారుతి సుజుకీ కారు.. సేఫ్టీ ఎక్కడ?

image

హైదరాబాద్ ORRపై జరిగిన కారు ప్రమాదపు ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో మారుతి సుజుకీ బ్రెజా కారు నుజ్జునుజ్జయి ఇద్దరు చనిపోయారు. ఈ మోడల్ కారు 5కు 4 Global NCAP rating సాధించినా ఇంతలా డ్యామేజ్ అవ్వడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. మైలేజీ కోసం చూసుకుని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కంపెనీ సైతం వినియోగదారుల ప్రాణాలను లెక్కచేయట్లేదని విమర్శలొస్తున్నాయి.

News March 6, 2025

బాబర్ ఆజమ్‌‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం

image

CTలో విఫలమైన పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను విమర్శించిన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌పై ఆయన తండ్రి ఆజమ్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2024 ICC T20 టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ను నేషనల్ T20 జట్టు నుంచి తొలగించారు. PSLలో రాణించి అతడు కమ్‌బ్యాక్ ఇస్తాడు. అతడిని విమర్శించే మాజీ క్రికెటర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నా. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే మీరు తట్టుకోలేరు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

News March 6, 2025

రన్యారావు తండ్రిపై గతంలో ఆరోపణలు

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి <<15652905>>రన్యారావు<<>> తండ్రి రామచంద్రరావు (DGP) కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ CMDగా ఉన్నారు. 2014లో ఈయన IGPగా ఉన్నప్పుడు కేరళకు వెళ్తున్న బస్సును మైసూరు దగ్గర ఆపి రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే అందులో రూ.2.27 కోట్లు ఉన్నాయని, పోలీసులు డబ్బును పక్కదారి పట్టించారని ఆ వ్యాపారులు వెల్లడించారు. ఈ కేసును సీఐడీ విచారించింది. కొన్ని రోజులకు ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చారు.

error: Content is protected !!