News June 14, 2024
ఫస్ట్ ఎయిడ్ అందించనున్న జొమాటో డెలివరీ ఏజెంట్లు

రోడ్లపై అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించేలా తమ డెలివరీ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆహార డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ దీపీందర్ గోయల్ ట్విటర్లో ప్రకటించారు. ‘నిన్న ముంబైలో 4300మంది డెలివరీ పార్టనర్లకు ఫస్ట్ ఎయిడ్ పాఠాలు నిర్వహించి మేం గిన్నిస్ రికార్డ్ బద్దలుగొట్టాం. ఇప్పుడు అత్యవసర సమయాల్లో 30వేలమంది జొమాటో ఏజెంట్లు వైద్య సహాయం అందించగలరు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News July 9, 2025
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. Sensex 46 పాయింట్ల లాభంతో 83,665 పాయింట్ల వద్ద,, Nifty 10 పాయింట్ల నష్టంతో 25,512 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, JSW స్టీల్, ICICI, HDFC, టెక్ మహీంద్రా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో షేర్లు నష్టాల్లో, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, మారుతీ సుజుకీ, M&M, సిప్లా, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!

ఓరోజు తగ్గుతూ తర్వాతి రోజు పెరుగుతూ బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 9, 2025
మేడిగడ్డ కూలిపోవాలనే గాలికొదిలేశారా?: బీఆర్ఎస్

TG: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని BRS ఆరోపించింది. ‘మేడిగడ్డపై సెక్యూరిటీని తొలగించడంతో బ్యారేజీపైన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయి. భారీ వాహనాల వల్ల పిల్లర్లపై ఒత్తిడి పడి కొట్టుకుపోవాలనేదే కాంగ్రెస్ కుట్ర. దీనిని పనికిరాని ప్రాజెక్టుగా చూపించి KCRను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఏపీ ప్రయోజనాలకు గోదావరి నీటిని బహుమతిగా ఇవ్వాలనే రెండో ప్లాన్ ఉంది’ అని రాసుకొచ్చింది.