News September 16, 2024
కస్టమర్ల విశ్వాసం కోసం Zomato కొత్త రూల్

రెస్టారెంట్ల మెనూలు, ప్రమోషనల్ మెటీరియల్స్లో ఏఐతో సృష్టించిన చిత్రాలు వాడకుండా జొమాటో నిషేధం విధించింది. డిజిటల్ మార్కెట్ ప్లేస్లో ఈ నిర్ణయం తీసుకున్న మొదటి కంపెనీగా నిలిచింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ పాటించకుంటే యాప్లో రెస్టారెంట్ పేర్లను తొలగిస్తామని హెచ్చరించింది. జొమాటోకు 276000 రెస్టారెంట్ పాట్నర్స్ ఉండగా అందులో 10% కొంత, 2% పూర్తిగా AI ఫుడ్ ఇమేజెస్నే వాడుతున్నాయి.
Similar News
News July 8, 2025
ప్రజాస్వామికంగా చర్చలు జరపాలి: పొన్నం

TG: పదేళ్లు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలోని పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. చర్చలు ప్రజాస్వామికంగా ఉంటూ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయట్లేదని, స్పీకర్కు లేఖ రాసి <<16988692>>చర్చకు<<>> రావాలన్నారు. చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.
News July 8, 2025
లండన్లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్లోని ఓ ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్లోని నాటింగ్ హిల్ ఏరియాలో ఉన్న సెయింట్ జాన్స్ వుడ్లో ఆయన ఇల్లు ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్లో చర్చ సందర్భంగా ట్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్లో స్థిరపడతారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
News July 8, 2025
ప్రెస్ క్లబ్కు చేరుకున్న కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.