News March 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీగా గెలిచిన కూటమి అభ్యర్ధి పేరాబత్తుల 

image

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఆయన గెలుపు పత్రం అందుకున్నారు. రాజశేఖరం వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉన్నారు. రాజశేఖరం గెలుపుతో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Similar News

News March 4, 2025

నల్గొండ: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ.

image

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలో 57 పరీక్షా కేంద్రాలలో 28,722 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

News March 4, 2025

GEFI & శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ జాయింట్ వెంచర్‌

image

HYDకు చెందిన జెమిని ఎడిబుల్స్& ఫ్యాట్స్, కోయంబత్తూరుకు చెందిన మసాలా బ్రాండ్ శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్‌ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు మంగళవారం ప్రెస్‌మీట్‌లో సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. బ్రాండింగ్& పంపిణీకి రూ.70 కోట్లు, రాబోయే రెండేళ్లలో మరో రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర రెడ్డి, విజయ్ ప్రసాద్, అక్షయ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

News March 4, 2025

ప్చ్.. కోహ్లీ సెంచరీ మిస్

image

ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీఫైనల్లో కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ కాస్త దూరంలో ఆగిపోయారు. 84 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43 ఓవర్లలో 226/5గా ఉంది. భారత్ విజయానికి 42 బంతుల్లో 39 రన్స్ అవసరం. క్రీజులో కేఎల్ రాహుల్ (31*), హార్దిక్ పాండ్య (1*) క్రీజులో ఉన్నారు.

error: Content is protected !!