News March 9, 2025

కూటమి విద్యార్థులను మోసం చేసింది: అవినాశ్

image

ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైసిపి శ్రేణులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అబద్దాలు చెప్పి విద్యార్థులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

Similar News

News March 10, 2025

NGKL: గురు ప్రీత్ సింగ్ కుటుంబ నేపథ్యం ఇదే..!

image

SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెంది 16 రోజులకు మృతదేహంగా బయటపడిన గురు ప్రీత్ సింగ్(40) కుటుంబ నేపథ్యం ఇదే. వీరిది పంజాబ్‌లోని చీమ కలన్ గ్రామంలో 1985లో జన్మించారు. తండ్రి విర్స సింగ్, ఎరెక్టర్ ఆపరేటర్‌గా పనిచేసేవారు. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీలో 2022లో రెగ్యులర్ ఉద్యోగిగా చేరారు. భార్య రాజ్విందర్ కౌర్ ఉన్నారు. ఆయన మృతదేహం బయటకు తేవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగారు.

News March 10, 2025

ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

image

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.

News March 10, 2025

నిజామాబాద్ జిల్లాకు రూ.600 కోట్లు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు రూ.200 కోట్ల చొప్పున రూ.600 కోట్లు మంజూరయ్యాయి.

error: Content is protected !!