News April 22, 2025

చేబ్రోలులో డయేరియా కలకలం

image

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మూడు రోజుల నుంచి వాంతులు వీరోచనాలతో ప్రజలు బాధపడుతున్నరని సమాచారం. ఇప్పటివరకు వందమందికి వాంతులు, విరోచనాలతో ప్రభుత్వాసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక పిహెచ్సీలో సక్రమమైన వైద్యం అందక చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ట్రి ట్‌మెంట్ చేయించుకుంటున్నారు. డయేరియా లక్షణాలపై అధికారులు ఇంకా స్పందించలేదు. 

Similar News

News April 23, 2025

HYD: OUలో వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజుకు అవకాశం

image

OU పరిధిలోని డిగ్రీ కోర్సులకు వన్ టైమ్ ఛాన్స్ పరీక్షా ఫీజులు స్వీకరిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫీజును వచ్చే నెల 19 వరకు చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in ను చూడాలన్నారు.

News April 23, 2025

రాజశేఖర్‌కు మే 6 వరకు రిమాండ్

image

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌కు ఏసీబీ కోర్టు మే 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో మొత్తం 29 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. A1గా రాజశేఖర్‌ను పేర్కొంది. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేసింది.

News April 23, 2025

నేడే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!