News February 12, 2025

తానూర్: రూ.5.70లక్షల నగదు పట్టివేత

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తానూర్ మండల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రూ.5.70లక్షల నగదు సాధనం చేసుకున్నట్లు ఏఎస్ఐ శ్యాముల్ తెలిపారు. కరీంనగర్ నుంచి మహారాష్ట్రలోని బోకర్‌కు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు వెల్లడించారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు.

Similar News

News February 12, 2025

రేపు గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని సూచనలను గమనించాలని APPSC తెలిపింది. ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని సూచించింది.

News February 12, 2025

మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి

image

ఘట్‌కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

News February 12, 2025

Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

error: Content is protected !!