News April 13, 2025
తిరుమల: పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న TTDసిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.
Similar News
News April 15, 2025
APR 17న IPLలో 300 స్కోర్.. స్టెయిన్ ప్రిడిక్షన్ వైరల్

వాంఖడే వేదికగా ఎల్లుండి SRH-MI మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ మార్చి 23 చేసిన ఓ ప్రిడిక్షన్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ‘ఏప్రిల్ 17న జరిగే మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి 300 స్కోర్ను చూడబోతున్నాం. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అది చూడటానికి నేను కూడా అక్కడ ఉండొచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో స్టెయిన్ అంచనా నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News April 15, 2025
సల్మాన్ను బెదిరించిన వ్యక్తికి మతిస్థిమితం లేదు: పోలీసులు

ఇటీవల సల్మాన్ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని గుజరాత్కు చెందిన మయాంక్ పాండ్య(26)గా ముంబై పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా మతిస్థిమితం లేని వ్యక్తి అని తేలిందని ప్రకటించారు. సల్మాన్ కారును బాంబుతో పేల్చేస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్లైన్కు ఇటీవల సందేశం వచ్చింది. వోర్లీ పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా నిందితుడి విషయం వెలుగుచూసింది.
News April 15, 2025
BREAKING: సీఎంకు తప్పిన ప్రమాదం

HYD నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం రేవంత్ ఎక్కిన లిఫ్ట్లో ఓవర్ వెయిట్ కారణం కిందికి పడిపోయినట్లు సమాచారం. సీఎం సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమైంది. సీఎంను బయటకు తీసుకురాగా.. మరో లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కు చేరుకున్నారు. నోవాటెల్లో సీఎల్పీ సమావేశానికి సీఎం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.