News March 1, 2025
పార్వతీపురం: ఇంటర్ పరీక్షలు.. 586 మంది గైర్హాజరు

కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 9,335 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 8,749 మంది హాజరయ్యారన్నారు. 586 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరాలు వెల్లడించారు. పరిక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
Similar News
News March 1, 2025
సీతంపేటలో పర్యటించిన కలెక్టర్

సీతంపేటలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా జరుగుతున్న జీడీ ప్రాసెసింగ్, అగరబత్తుల తయారీ విధానాన్ని పరిశీలించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పట్టు పరిశ్రమ యూనిట్ను సందర్శించారు. సీతంపేట ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.
News March 1, 2025
దేశానికి రోల్ మోడల్లా పోలీస్ స్కూల్: సీఎం

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. HYD మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ను దేశానికి రోల్ మాడల్గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్కూల్ <
News March 1, 2025
‘అందుకొనేంత దూరంలో అభివృద్ధి చెందిన దేశం’

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం అందుకొనేంత దూరంలోనే ఉందని 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగడియా అన్నారు. ఇందుకు కొన్ని సంస్కరణలు అవసరమని సూచించారు. ‘ప్రస్తుత ధరల వద్ద డాలర్ ప్రాతిపదికన 2003-24 వరకు భారత్ 10.1% వృద్ధిరేటు సాధించింది. మరో పదేళ్లు ఇదే రేటు కొనసాగిస్తే దేశం $9.5T ఎకానమీ అవుతుంది. 2047 నాటికి తలసరి ఆదాయం $14000 కావాలంటే 7.3% గ్రోత్ అవసరం’ అని వివరించారు.