News February 7, 2025
పెద్దపల్లి జిల్లాలోని నేటి టాప్ న్యూస్
@ ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ@ గోదావరిఖనిలో బులియన్ వ్యాపారి పరారీ@ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష@ సుల్తానాబాద్ లో డయాబెటిస్ పరీక్షలకు విశేష స్పందన@ పెద్దపల్లి దుకాణాలలో మున్సిపల్ సిబ్బంది ఆకస్మిక తనిఖీ@ భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ: రామగుండం సిపి శ్రీనివాస్@ పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం పై దాసరి ఉష విమర్శలు
Similar News
News February 7, 2025
సోనూసూద్ అరెస్ట్కు వారెంట్
నటుడు సోనూసూద్కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.
News February 7, 2025
NGKL: చెరువులో పడి మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
News February 7, 2025
నేడు క్యాబినెట్లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ, ఆమోదం!
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ క్యాబినెట్లో చర్చించి ఆమోదించనున్నారని పేర్కొన్నాయి. వారంలో లోక్సభలో ప్రవేశపెడతారని చెప్పాయి. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కొత్త బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందరికీ అర్థమయ్యేలా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.