News January 30, 2025
బాపట్ల జిల్లాలో MLC ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే.!

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే <<15306092>>బాపట్ల జిల్లాలోని<<>> వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, పిట్టలవానిపాలెం మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా గ్రాడ్యుయేట్ MLCగా ఉన్న KS లక్ష్మణరావు మరోసారి పోటీ చేయనుండగా.. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు.
Similar News
News March 14, 2025
గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.
News March 14, 2025
బాచుపల్లి: కాలుష్యంపై రేపు నిరసన

పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు నిరసన తెలియచేయనున్నట్లు 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మీ సుబ్బారావు తెలిపారు. సనత్నగర్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో రేపు ఉదయం 11 గం.లకు అధికారులకు వినతిపత్రం అందచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
News March 14, 2025
రేగొండ: విద్యుత్ షాక్తో రైతు మృతి

విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి(52) డీబీఎం-38 కెనాల్ మోటార్ పైపు కింద చెత్తను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.