News February 5, 2025
బాపట్ల: టీడీపీ స్థలం కబ్జా.. నిందితులు అరెస్ట్
బాపట్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 2000 సంవత్సరంలో దాతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వగా పలువురు స్థలాన్ని కబ్జా చేసి విక్రయించినట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 5, 2025
ఉత్తమ ఫలితాలు సాధించాలి: ASF అదనపు కలెక్టర్
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం వాంకిడి మండలం ఇందాని ZPHSను ఆయన సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మెనూతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు.
News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI
నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
News February 5, 2025
కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం
TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.