News April 24, 2025

భద్రాచలంలో 43.1°C అత్యధిక ఉష్ణోగ్రత

image

జిల్లాలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాచలంలో 43.1°C ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా దమ్మపేటలో 39.1°C ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం మండలాల్లో 43°C, కరకగూడెంలో 42.9°C, చుంచుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, మణుగూరు మండలాల్లో 42.7°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News April 24, 2025

వరంగల్‌లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

image

TG: వరంగల్‌లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

News April 24, 2025

పహల్‌గామ్ దాడి.. ఉగ్రవాదులపై రివార్డు ప్రకటన

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. అదిల్ హుస్సేన్, అలీ భాయ్ (తల్హా భాయ్), హషీమ్ ముసా (సులేమాన్) ఊహాచిత్రాలతో పోస్టర్లు రిలీజ్ చేశారు. వారి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.20లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

News April 24, 2025

రేపు ఆకాశం ‘నవ్వుతుంది’

image

ఆనందానికి చిహ్నమైన స్మైలీ ఫేస్ రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 5.30 గంటలకు శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. శుక్రుడు, శని 2 కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లుగా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా తెలిపింది. మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది.

error: Content is protected !!