News February 9, 2025
భద్రాద్రిలో దారుణం.. గర్భిణి ఆత్మహత్యాయత్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739033927081_1280-normal-WIFI.webp)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని రామాంజిగూడెంకు చెందిన మౌనిక అనే గర్భిణి కుటుంబ కలహాలతో శనివారం పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త మధు హుటాహుటిన ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వివరించారు.
Similar News
News February 10, 2025
ఇండియన్ ఐడిల్లో ADB జిల్లా యువతి ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739113953698_20476851-normal-WIFI.webp)
ఇండియన్ ఐడిల్ తో పాటు జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమ సూపర్ సింగర్స్ ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్ యువతి మొదటి స్థానంలో నిలిచారు. అదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన యువతి అభిజ్ఞ ఆదివారం జరిగిన ఫైనల్లో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటారు. దీంతో కౌన్సిలర్ బండారి సతీష్, కాలనీ వాసులు యువతికి అభినందనలు తెలిపారు.
News February 10, 2025
26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739139391741_893-normal-WIFI.webp)
ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.
News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739137889692_893-normal-WIFI.webp)
TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.