News March 17, 2025
రాయచోటి: మండలికి అధ్యక్షత వహించిన మైనార్టీ మహిళ

తొలిసారి డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో మైనార్టీ మహిళ జకియా ఖానం శాసనమండలికి అధ్యక్షత వహించారు. కాగా ఈమె అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వారు కావడం గమనార్హం. అధిపతి లేనప్పుడు ఈ అవకాశం దక్కుతుంది. మైనార్టీ మహిళ YCP తరపున ఎమ్మెల్సీగా ఎంపికవ్వడం, డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో కూర్చోవడం మరో అరుదైన అవకాశం.
Similar News
News March 18, 2025
మహబూబాబాద్: నిలిచిన పలు రైళ్లు..!

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
News March 18, 2025
కుబీర్: కరెంట్ షాక్తో రైతు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్(48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికి రాలేదని తన కుమారుడు వెళ్లి చూడగా కరెంట్ షాక్కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
News March 18, 2025
వనపర్తి: 103 ఏళ్ల వృద్ధుడు మృతి

మదనాపురం మండలం నరసింగాపురానికి చెందిన శతాధిక వృద్ధుడు మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పెద్దఆశన్న(103) మొదటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా ఎన్నికై మూడు పర్యాయాలు కొనసాగారు. ఐదుసార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి మాజీ సర్పంచ్ భాగమ్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.