News April 6, 2025
వనపర్తి: ప్రభుత్వ వైఫల్యాలపై సమరం: నిరంజన్ రెడ్డి

BRS పార్టీ ఆవిర్భావ రజితోత్సవ మహాసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో కలిసి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజాసంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై BRS ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
Similar News
News April 7, 2025
ప్రజావాణిలో 106 దరఖాస్తులు: కలెక్టర్ ప్రావీణ్య

వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 106 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
News April 7, 2025
జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 7, 2025
HCU విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: భట్టి

TG: కంచ భూముల పరిరక్షణ కోసం నిరసనలు చేసిన HCU విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. న్యాయశాఖ అధికారులు ఇందుకు తగిన సూచనలు చేయాలని వెల్లడించారు.