News February 7, 2025
సంగారెడ్డి: డబుల్ డెక్కర్ రైలును చూశారా..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738936954407_20061001-normal-WIFI.webp)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో డబుల్ డెక్కర్ రైలు నిలిచింది. చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ డబుల్ డెక్కర్ రైలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి వెళుతుండగా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. దాంతో ఇక్కడి ప్రాంత ప్రజలు అరుదైన డబుల్ డెక్కర్ రైలును ఆసక్తిగా తిలకించారు. స్టేషన్లోని ప్యాసింజర్లు ప్లాట్ ఫామ్ వద్ద డబుల్ డెక్కర్ రైలుతో సెల్ఫీ ఫోటోలు దిగి సందడి చేశారు.
Similar News
News February 8, 2025
మెదక్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738870304489_50061539-normal-WIFI.webp)
మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన యువ అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.
News February 8, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738516367269_695-normal-WIFI.webp)
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుగలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చిన విధంగానే భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం వస్తూ ఉంటాయి. పేదరికం, ఐశ్వర్యం శాశ్వతం కాదు.
News February 8, 2025
నిర్మల్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738935741630_51901280-normal-WIFI.webp)
వ్యాసరచన పోటీల్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం సాధించిన ఎస్ఐ జ్యోతిమణిని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల నగదు పురస్కారంతో అభినందించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఫ్లాగ్ డే పోటీలలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్ఐ జ్యోతిమణి రూ.15000 నగదును అందజేశారు. రాష్టస్థ్రాయిలో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు ఉన్నారు.