News April 5, 2025

సిరిసినగండ్ల సీతారాముల కళ్యాణానికి ఆలయం ముస్తాబు..!

image

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన చారకొండ మండలం సిరిసినగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణానికి దేవాలయం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం తిలకించడానికి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Similar News

News April 7, 2025

జగిత్యాల: ప్రారంభమైన 10వ తరగతి స్పాట్ వాల్యూషన్

image

జగిత్యాల పట్టణంలోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో సోమవారం నుంచి పదవ తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు తెలుగు పేపర్ వాల్యూయేషన్ కోసం 70 మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ప్రతి రోజూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉంటుంది.

News April 7, 2025

ముంబై డెడ్లీ బౌలింగ్ అటాక్.. ఆర్సీబీకి సవాలే!

image

ఇవాళ ముంబై బౌలర్ల రూపంలో ఆర్సీబీకి సవాల్ ఎదురుకానుంది. స్వింగ్‌తో మ్యాజిక్ చేసే బౌల్ట్, దీపక్ చాహర్‌లకు తోడుగా బుమ్రా వస్తున్నారు. వీరిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒకపక్క పొదుపుగా బౌలింగ్ చేస్తూనే మరోపక్క వికెట్లు తీస్తారు. ఇక కెప్టెన్ హార్దిక్ గత మ్యాచులో 5 వికెట్లు తీసి జోరుమీద ఉన్నారు. యువ బౌలర్లు అశ్వనీకుమార్, విఘ్నేశ్‌లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

News April 7, 2025

ఖమ్మంలో ఏలూరు జిల్లా వాసి మృతి

image

ఖమ్మం పట్టణం నేతాజీనగర్‌లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. చింతలపూడికి చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి గత 4 నెలలుగా ఓ మహిళతో నేతాజీ నగర్‌లో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వీరిద్దరి మధ్య రాత్రి వాగ్వాదం జరగడంతో రవిప్రసాద్‌ను సదరు మహిళ గోడకు నెట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!