News May 26, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్ల పరిశీలన

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్-2024 రాసిన అభ్యర్థులు ఫీజు చెల్లించిన వారు ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీలోగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ, 5 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 10,871 మంది పాలిసెట్ రాశారు. ఇందులో 9,576 మంది అర్హత సాధించారు.

Similar News

News January 10, 2026

కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు

image

కొత్తూరు మండల కేంద్రంలో ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. కొత్తూరు నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఈ ఇబ్బందులు తప్పలేదు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇలా కిక్కిరిసి గమ్యస్థానాలకెళ్లారు. ఫ్రీ బస్సు, పండగ రద్దీ కూడా దీనికి తోడైంది. అధికారులు స్పందించి తగినన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News January 10, 2026

శ్రీకాకుళం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మహేశ్ (27) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. ఏడాది క్రితం పలాస మండలానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం కాశీబుగ్గలో నివాసం ఉంటున్నారు. ఇరువురు మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News January 10, 2026

SKLM: వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

image

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్‌ విజయ సారధి హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేయరాదన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.