News September 12, 2025

ములుగు: సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

image

సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు ఇచ్చి సర్వే పూర్తి చేయాలని సూచించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణను వేగవంతం చేయాలన్నారు.

Similar News

News September 12, 2025

AP న్యూస్ రౌండప్

image

✶ శ్రీశైలం ప్రాజెక్టు, తుంగభద్ర, కాటన్ బ్యారేజ్, గోరకల్లు జలాశయం మరమ్మతులకు రూ.455Cr మంజూరు చేసిన ప్రభుత్వం.. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
✶ డిగ్రీ ప్రవేశాల గడువు 13వ తేదీ వరకు పొడిగింపు
✶ ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు
✶ ఈడిగ, గౌడ (గమల్ల), కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశయన (సెగిడి) కులాల ముందు గౌడ్ అనే పదాన్ని తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం

News September 12, 2025

నేడు వైస్ ప్రెసిడెంట్‌గా రాధాకృష్ణన్ ప్రమాణం

image

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, NDA కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

News September 12, 2025

కూకట్‌పల్లి: హత్య చేసిన ఇంట్లోనే స్నానం చేసిన నిందితుడు

image

రేణు అగర్వాల్‌ను నిందితుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటగా కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి గొంతు కోసి హతమార్చాడు. వంటింట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోనే స్నానం చేసి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై పరారయ్యాడు. భర్త కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి రేణు రక్తపు మడుగుల్లో ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.