News August 14, 2024

1947: బల్బులు, జంతువులను కూడా పంచుకున్నారు!

image

భారత్, పాకిస్థాన్ విభజనపై నాటి విభజన మండలి పెద్దలు పెద్ద యజ్ఞమే చేశారు. సైన్యం పంపిణీ అతి పెద్ద సవాల్‌గా మారింది. భారత్‌కు 2.6 లక్షలు, పాక్‌కు 1.4 లక్షల బలగాలు దక్కాయి. పాక్ సైనికుల్లో అత్యధికులు ముస్లింలే. టాస్‌లో నెగ్గి గుర్రపు బగ్గీని భారత్ దక్కించుకుంది. ఆస్తులన్నింటినీ ఇరుదేశాలు 80:20 నిష్పత్తిలో పంచుకున్నాయి. బల్బులు, జోయ్‌మొనీ ఏనుగు విషయంలోనూ పెద్ద ప్రహసనం నడిచినా ఇండియానే దక్కించుకుంది.

Similar News

News February 8, 2025

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ముందంజ

image

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రస్తుతం 40+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

News February 8, 2025

ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. లీడింగ్‌లో ఆ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటింది. మొత్తం 70 స్థానాలుండగా 36 చోట్ల గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 38 స్థానాల్లో లీడింగ్‌లో దూసుకెళ్తోంది. ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో అలాగే పట్టు నిలుపుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆప్ 25 చోట్ల ముందంజలో కొనసాగుతోంది.

News February 8, 2025

ముస్లింల ప్రాంతంలో ఆప్ ముందంజ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్ ఆధిపత్యం కనబరుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. దీంతో ముస్లిం ప్రాంతాలల్లో ఆప్ పట్టు నిలుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్‌గా బీజేపీ 30 చోట్ల, ఆప్ 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక చోట లీడింగ్‌లో ఉంది.

error: Content is protected !!